gouthamraju.blogspot.com Open in urlscan Pro
2a00:1450:4001:812::2001  Public Scan

Submitted URL: http://gouthamraju.blogspot.ru/
Effective URL: http://gouthamraju.blogspot.com/
Submission: On June 02 via api from DE — Scanned from DE

Form analysis 0 forms found in the DOM

Text Content

గౌతమ్ రాజు

ఇది నా ప్రపంచం





MONDAY, SEPTEMBER 24, 2012


తల్లీ పిల్లల డైటీషియన్




ఇండియాలో మంచి చదువులే చదువుకున్నా అమెరికాకి రాగానే ఆ చదువుకు సంబంధం లేని మంచి
జీతాలొచ్చే వేరే ఉద్యోగాలకి చాలామంది వెళ్లిపోతారు. కానీ కొంతమంది మాత్రం తమకు
సంతృప్తినిచ్చే ఉద్యోగంలోనే కొనసాగి ఉన్నత స్థానాలకి ఎదుగుతారు. అలా ఎదిగిన వారిలో
జయశ్రీ జానకీరాం కూడా ఒకరు. చాలామంది వేరే ఉద్యోగాలకి ప్రయత్నం చేయమని చెప్పినా
వినలేదు నేను. నాకు నచ్చిన పనిలోనే కొనసాగుతున్నాను అంటున్న జయశ్రీ వాషింగ్టన్‌లో
చ్రిల్డన్ నేషనల్ మెడికల్ సెంటర్లో విమెన్, ఇన్‌ఫాంట్, చ్రిల్డన్ సప్లిమెంటల్
న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌కి లోకల్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆవిడే  మన
పరదేశీ....

"పెళ్లయ్యి అమెరికా వచ్చాక చదువుకున్న చదువుకి న్యాయం చేయాలని, అదే సమయంలో
నలుగురికీ ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో రిజిస్టర్డ్ డైటీషియన్ ఇంటర్న్‌షిప్
చేసి డైటీషియన్ అయ్యాను'' అని అంటారు జయశ్రీ. "అమెరికాలో ఉద్యోగాలు చేసేవారు ఆ
ఉద్యోగాలకి తగ్గట్టు అక్కడి వస్త్రధారణ చేసుకుంటారు కదా మరి మీరెప్పుడూ చీరలో,
కుంకుమ బొట్టుతోనే కనిపిస్తారు'' అని అడిగితే... "మన భారతీయ సంస్కృతి, ఆచారాలు,
పద్ధతులంటే అన్ని సంస్కృతుల వారికి ఎంత గౌరవమో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

ఇక్కడ పనిచేసేటప్పుడు పాశ్చాత్య దుస్తులే వేసుకోవాలి, లేకపోతే ఉద్యోగం చేయలేవు అని
ఇక్కడికి రాకముందు చాలామంది నాతో చెప్పారు. కానీ నేను అమెరికాకు వచ్చినప్పటినుండి
చీర తప్ప వేరే దుస్తులు వేసుకోలేదు. నా సహచరులు నేను మారకుండా ఉన్నందుకు నన్ను చాలా
గౌరవిస్తారు. ఒక్కోసారి చిన్నపిల్లలు నా బొట్టు చూసి ప్రశ్నలేస్తుంటారు. అది మన
సంస్కృతి గురించి పిల్లలకు చెప్పే అవకాశంగా తీసుకుని నేను వారికి అర్థమయ్యేలా
బొట్టు గురించి చెప్తాను'' అని గర్వంగా చెప్పారు జయశ్రీ.

ప్రయోగ జీవితం...
చిన్నప్పటి నుంచే దేన్నయినా ప్రశ్నించేతత్వం, పరిశోధించేతత్వం జయశ్రీలో ఉంది. శ్రీ
వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి హోమ్‌సైన్స్‌లో ఎమ్ఎస్‌సి చేశాను. చదువుకునే వయసులో
ఉప్పుడు బియ్యం మామూలు బియ్యం కంటే ఎందుకు మెరుగైందనే ప్రశ్న వేసుకుని సమాధానం
కోసం ప్రయోగం చేశారు కూడా. ఈ జిజ్ఞాస ఇప్పటికీ ఆమెలో అలానే ఉండిపోయింది. అందుకే
ఇక్కడ ఉన్న హిస్‌పానిక్, స్పానిష్ పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు
వస్తుందనే దానిపై ఆమె రీసెర్చ్ చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల
దృష్టి టీవీ ప్రోగ్రాంపై ఉండి వారు ఎంత తింటున్నారో తెలియడం లేదు.

కడుపు నిండినా తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే అంత చిన్న పిల్లలకు అర్థం
కాదు. అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా ఆ
సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, ఎక్సర్‌సైజ్ బైక్ ఉంటే అది
తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము. కనీసం ఇరవై నిమిషాలు ఇలా
చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే. ఈ కార్యక్రమం వల్ల ఇరవై శాతం
ఫలితం సాధించాము. పోగా పోగా ఈ శాతం మరింత పెరుగుతూ పోతుందనే నమ్మకం మాకుంది'' అని
ఒబెసిటీని చిన్న పిల్లల్లో ఎలా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో జయశ్రీ
తెలియజేశారు.

బిడ్డకు తల్లి పాలు ఎంత మంచివో కూడా జయశ్రీ ప్రచారం చేస్తుంటారు. కేవలం ప్రచారం
చేయడమే కాదు కొత్తగా తల్లులయిన వారి నుంచి బిడ్డలకు డబ్బాపాలు తాగించబోమనే పత్రంపై
సంతకం తీసుకుంటారు. వారికి తల్లి పాల వలన కలిగే మేలును బోధిస్తారు. ఆస్పత్రుల్లో,
స్కూళ్ళలో, కమ్యూనిటీ క్లినిక్‌లలో ప్రతి నెలా వేలమందికి పైగా క్లయింట్లను ఈమె
చూస్తారు. తమతో పదేళ్ళుగా కలిసి పని చేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన నిధులను
కూడా జయశ్రీ సేకరిస్తుంటారు. ఆయా ఏజెన్సీలకు చేదోడు, వాదోడుగా ఉంటారు.

కలసిపోతే కలదు సుఖం...
"ఇక్కడి జీవితానికి ఎలా అలవాటుపడ్డారు?'' అని అడిగితే తన గతాన్ని జయశ్రీ
తడుముకుంటూ..." నేను తొలిసారి అమెరికాలో అడుగుపెట్టినపుడు నా భర్త జానకీరామ్, మరో
ఇద్దరు అమెరికన్ స్నేహితులు నాకు స్వాగతం పలికారు. ఇప్పటికీ ఆ ఇద్దరూ మాకు మంచి
సన్నిహితులే. ఇక్కడ ఇతరులతో త్వరగా కలసిపోవచ్చు. నాకు పరిచయం ఉన్న వారిలో గ్రీక్,
యూరోపియన్, ఆసియా, దక్షిణ అమెరికాల వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్‌లు ఉన్నారు.

వాషింగ్టన్ డి.సిలో మా అమ్మాయి పెళ్లి చేసినపుడు వచ్చిన అతిథుల్లో సగం మంది
భారతీయులు ఉంటే, మిగతా సగం వివిధ దేశాల వారు ఉన్నారు. అలాగే మా అబ్బాయి వివాహం
భారతదేశంలో జరిపినపుడు కూడా ఇక్కడి వారు చాలామంది మన దేశానికి వచ్చారు. అంతగా
ఇక్కడి వారితో మమేకమయ్యాను'' అంటూ చెప్పుకొచ్చారు.

ఆనందాల కొలువు...
మన సంప్రదాయాలకు జయశ్రీ పెద్ద పీట వేస్తారు. అందుకే వారి ఆఫీసులో ఫ్యాషన్ షో
నిర్వహించినపుడు స్త్రీలందరూ చీరలు కట్టుకుని వచ్చేట్టు చేశారు. జయశ్రీ ఇంట్లో
జరిగే సంక్రాంతి పండగ ఒక అంతర్జాతీయ వేడుకలా కనిపిస్తుంది. ఆరోజు ఏర్పాటు చేసే
బొమ్మల కొలువుకు వివిధ దేశాల వారు వస్తారు. ఆ సంబరంలో రకరకాల ఆహారం పలకరిస్తుంది.
ఒక వైపు సమోసాలు, ఇంకోవైపు ఇటాలియన్, మెక్సికన్, గ్రీక్, యూరోపియన్ రుచులు కూడా
నోరూరిస్తాయి. ఇలా అన్ని దేశాలకు చెందిన వ్యక్తుల నడుమ ఆమె సంక్రాంతిని
జరుపుకుంటారు. మాతృదేశంలో జరిగే సంక్రాంతి వేడుకలకు దూరమైనా అలా అందరి సమక్షంలో
చేసి ఆనందాన్ని తాము పొందడమే కాకుండా ఇతరులకూ మన సంస్కృతిని పరిచయం చేస్తున్నారు.

పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే దానిపై ఆమె రీసెర్చ్
చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల దృష్టి టీవీ ప్రోగ్రాంపై ఉండి వారు
ఎంత తింటున్నారో తెలియడం లేదు. కడుపు నిండినా తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే
అంత చిన్న పిల్లలకు అర్థం కాదు. అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో
ప్రకటనలు వస్తాయి కదా ఆ సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం,
ఎక్సర్‌సైజ్ బైక్ ఉంటే అది తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము.
కనీసం ఇరవై నిమిషాలు ఇలా చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే.

- కనకదుర్గ (అమెరికా నుంచి)


Posted by Gouthamaraju at 4:27 AM No comments:

Labels: business, Gouthamaraju, india, life, women, world, మహిళ



WEDNESDAY, APRIL 4, 2012


సూకీ స్నేహం



 
















    










ఆంగ్ సాన్ సూకీ మరోసారి అంతర్జాతీయ వార్త అయింది. ఆమె గెలుపు మయన్మార్(బర్మా)
ప్రజలకే కాదు ప్రజాస్వామ్య ప్రియులందరికీ శుభవార్త అయింది. ప్రజాస్వామ్యం కోసం మూడు
దశాబ్దాలుగా పోరాడుతూ, అందులో అధికభాగం గృహనిర్బంధంలో ఉన్న సూకీ రాసిన ఉత్తరాలే-
లెటర్స్ ఫ్రమ్ బర్మా. దీనిలో బర్మా ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, మౌలిక
భావనలు, విలువలతో పాటు సూకీ వ్యక్తిగత అనుభవాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక
ఆసక్తికరమైన భాగాన్ని మీకు అందిస్తున్నాం.

జైలులో ఉన్నప్పుడు పక్షులు, చిన్న జంతువులు, క్రిమికీటకాదులే నా స్నేహితులు.
ఇప్పటికీ అనేక మంది స్నేహితులు, సహచరులు ఈ జీవాలతో తమకున్న అనుభవాలను తమ రచనల
ద్వారా పంచుకున్నారు. జైలు గోడల్ని, ఇనుప ఊచల్ని దాటి ఖైదీలతో స్నేహం చేసే
జీవుల్లో పిల్లులు ప్రధానమైనవి. ఒంటరి జీవితం గడుపుతున్న ఖైదీలు, తమకు ఇచ్చిన
ఆహారంలో కొంత భాగం వీటికి పెడుతూ ఉంటారు. బయట ప్రపంచాన్ని చూడలేని ఖైదీలకు ఈ
పిల్లులే సహచరులు. నేను ఇన్‌సియిన్ జైలులో ఉన్న రెండేళ్లలో ఎప్పుడూ పిల్లులను
చూడలేదు. కాని గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లులు అప్పుడప్పుడు వచ్చి నన్ను
పలకరిస్తూ ఉండేవి.

నాకు పిల్లుల కన్నా కుక్కలంటే చాలా ఇష్టం. అయితే నాకు తెలిసిన తొలి పెంపుడు జంతువు
పిల్లే. నా చిన్నప్పుడు ఒక పెద్ద పిల్లి ( నేను చిన్నపిల్లను కాబట్టి ఆ పిల్లి చాలా
పెద్దగా కూడా కనిపించి ఉండచ్చు) మా ఇంట్లో తిరుగుతూ ఉండేది. మా తాతగారు తన
గంభీరమైన గొంతుతో ఆ పిల్లిని 'పస్..పస్..పస్' అని పిలుస్తూ ఉండేవారు. మా
కుటుంబసభ్యులందరం ఆ పిల్లిని గౌరవంగా 'తాతగారి పిల్లి' అని సంబోధిస్తూ ఉండేవాళ్లం.
మా ఇంటి పక్కనే ఉన్న వీధిలో అనేక పిల్లులు, కుక్కలు తిరుగుతూ ఉండేవి. అవి మా
గార్డెన్‌లోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవి. ఇంట్లో
పెద్దవాళ్లు వాటిని తరిమేస్తూ ఉండేవారు. ఒక సారి నాకొక కల వచ్చింది. దాంట్లో ఒక
కుక్క మా వంటింటి పక్కన చాలా పిల్లలను పెట్టింది. ఆ కుక్క పిల్లలు వచ్చి నా కాళ్లను
నాకుతున్నాయి. అంతే- కలలోనుంచి ఉలిక్కిపడి లేచా. ఆ కుక్క పిల్లలు ఏమయ్యాయో నాకు
అర్థం కాలేదు. ఒక్క క్షణం నాకు అంతా అయోమయంగా అనిపించింది.

1950లలో రంగూన్ వీధుల్లో అనేక రకాల వాహనాలు తిరుగుతూ ఉండేవి. రకరకాల బస్సులు, రెండో
ప్రపంచయుద్ధంలో వాడి వదిలేసిన జీపులు, యుద్ధం జరగకముందు వాడిన పెద్ద కారులు, వెనక
భాగంలో ఇద్దరు కూర్చోవటానికి వీలుగా ఉన్న సైకిళ్లు (వీటిని సైడ్ కార్స్ అంటారు),
రిక్షాలు ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉండేవి. వీటితో పాటు గుర్రపు బగ్గీలు కూడా
ఉండేవి. గుర్రాలు బక్క చిక్కి గాయాలతో రసి కారుతూ ఉండేవి. ఇలాంటి మరెన్నో మూగజీవాల
గురించి నాకు సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ (ఎస్‌పీసీఏ)
ద్వారా తెలిసింది.

ఇవి కాకుండా కొందరు హాలీవుడ్ సినిమాల్లో చూపించే గుర్రాలవంటి వాటిపై రంగూన్
వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. మా అమ్మ ఢిల్లీలో బర్మా రాయబారిగా ఉన్నప్పుడు
గుర్రాలతో నాకు అనుబంధం ఏర్పడింది. ప్యారీ ఆయిస్టర్ అనే గుర్రం మీద నేను
గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఒక రైడింగ్ క్లబ్‌లో కూడా చేరాను.
అక్కడ గుర్రాలకు బ్లాక్ ప్రిన్స్, పృధ్వీరాజ్, శివాజీ వంటి పేర్లు ఉండేవి. వీటిలో
బ్లాక్ ప్రిన్స్ నాకు ఫేవరెట్. అయితే గుర్రాలపై దూకుతూ సాహసం చేయటం నాకు పెద్ద
ఇష్టం ఉండేది కాదు.

ఇంగ్లాండ్‌లో చదువుతున్నప్పుడు నేను కుక్కల ప్రేమికుల ప్రపంచంలోకి అడుగుపెట్టాను.
ఇంగ్లాండ్‌లో ఉన్న నా స్నేహితుల ఇళ్లకు అప్పుడప్పుడు సెలవులు గడపటానికి వెళుతూ
ఉండేదాన్ని. ప్రతి కుటుంబంలోను కుక్కలను ప్రేమించేవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా
ఉండేవారు. ఒక స్నేహితురాలి ఇంట్లో సెయిలర్ అనే కుక్క ఉండేది. ఈ కుక్క కంటి చుట్టూ
నల్లటి మచ్చ ఉండేది. ఇది జిన్ కూడా తాగేది. ఇంటికి ఇచ్చిన అతిథులను సాదరంగా
ఆహ్వానించేది. మరో స్నేహితురాలి ఇంట్లో హ్యాండ్‌సమ్ అనే గోల్డెన్ లాబ్రిడార్
ఉండేది.అది అందరి పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించేది.

ఈ రెండు నా స్నేహితురాళ్లయితే.. మా ఆంటీ అల్సేషన్ ఇంపీ మాత్రం మా కుటుంబ సభ్యుల్లో
ఒకరిగా కలిసిపోయింది. నేను ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్నప్పుడు నేను, మా ఆంటీ,
ఇంపీ ఒకే చోట ఉండేవాళ్లం. ఇంపీ నన్ను ఎవరైనా ఏదైనా అంటే సహించేది కాదు. నన్ను
ఎప్పుడూ కాపాడుతూ ఉండేది. నేను ఇంటికి ఆలస్యంగా వస్తే- నేను వచ్చేదాకా గుమ్మం
దగ్గరే ఎదురుచూస్తూ ఉండేది. ఇంపీకి తెలియని వారు ఎవరైనా ఇంటికి వస్తే- వాళ్లను
సోఫాలో నా పక్కన కూర్చోనిచ్చేది కాదు.

1972లో నేను, మైఖల్ పెళ్లి చేసుకున్నాం. బర్మాలో కాపురం పెట్టాం. వెంటనే మేం ఒక
కుక్కను తెచ్చుకున్నాం. తెల్లటి బొచ్చుతో, అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలతో ఆ కుక్క
చూడటానికి చాలా అందంగా ఉండేది. దాని పేరు కోసం చాలా కాలం వెతికి చివరకు పప్పీ అనే
పేరే పెట్టాం. పప్పీ చాలా చిన్నగా ఉండేది. నా పీక పట్టుకొని పడుకొనేది. మైఖల్
బెడ్‌రూమ్ చెప్పులకు ఉన్న లైనింగ్‌తో ఆడుకొనేది. మేం ఎక్కడికి వెళ్తే అక్కడకి మాతో
వచ్చేది.

ఈ విధంగా మాతో పాటు పప్పీ కూడా సగం ప్రపంచం తిరిగింది. నాకు పిల్లలు పుట్టిన తర్వాత
వారి పట్ల కూడా పప్పీ చాలా బాధ్యతగా వ్యవహరించేది. మేం ఆక్స్‌ఫర్డ్‌లో
నివసించేటప్పుడు పప్పీ మా ఇంటికి ఒక ట్రేడ్‌మార్క్‌గా మారింది. మా స్నేహితులకు,
బంధువులకు ఆ కుక్కంటే చాలా ఇష్టం. 19 ఏళ్ల వయస్సులో పప్పీ చచ్చిపోయింది. పప్పీ
చనిపోయే సమయానికి నేను బర్మాలో గృహనిర్బంధంలో ఉన్నా. అందువల్ల దాని చివర చూపులు
కూడా నాకు దక్కలేదు.

- లెటర్స్ ఫ్రమ్ బర్మా
ఆంగ్ సాన్ సూకీ
పేజీలు: 224
ప్రచురణ: పెంగ్విన్




Posted by Gouthamaraju at 11:14 PM No comments:

Labels: Burma, Famous Persons, Father, Gouthamaraju, Journalism, life, mahila,
News, sukee, women, world, మహిళ



MONDAY, FEBRUARY 6, 2012


ఒక ఖరీదైన గ్రామం * CHINA'S RICHEST VILLAGE — HUAXI VILLAGE


  The Longxi International Hotel in the village of Huaxi


స్టార్ హోటళ్లు, విల్లాలు, బీఎండబ్ల్యు కార్లు- ఖరీదైన నగరాల్లో కనిపించడం సహజం.
అదే పల్లెల్లో కనిపిస్తే- అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆశ్చర్యానికి కారణమైన
గ్రామం పేరు 'హక్సీ విలేజ్'.
"ఇది పల్లెటూరా..? ఇంత విలాసవంతమైన సౌకర్యాలు మెట్రోసిటీల్లో కూడా ఉండవు'' అంటారు
హక్సీ విలేజ్‌ను తొలిసారి చూసిన సందర్శకులు. ఖరీదైన పగోడాలు, టన్నెల్స్, లాంగ్సీ
లేక్, వరల్డ్ గార్డెన్, ఫార్మర్ గార్డెన్‌లతో తీర్చిదిద్దినట్లు ఉంటుంది ఆ ఊరు.
గ్రామం మధ్యలోకి వెళ్లగానే 60 అంతస్తుల ఆకాశహర్మ్యం కనిపించి ఔరా ఏమిటీ అద్భుతం
అనిపిస్తుంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో ఉన్న ఈ గ్రామం.. 

బీజింగ్ నుంచి 600 కిలోమీటర్లు వెళితే వస్తుంది. చైనీయులందరూ దీన్ని లిటిల్ దుబాయ్
అని ముద్దుగా పిలుచుకుంటారు. ఖరీదైన హక్సీ విలేజ్‌ను 1961లో స్థానిక కమ్యూనిస్టు
పార్టీ కార్యదర్శి వూరెన్‌బావో స్థాపించారు. 

గ్రామంలోని రైతులంతా శ్రీమంతులు. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.25 కోట్ల
దాకా డబ్బులు నిల్వ ఉంటాయంటే ఎంత షావుకార్లో అర్థమవుతుంది. వీరికి ఇన్నేసి ఆస్తులు
వారసత్వంగా రాలేదు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవసాయంలో విప్లవాత్మక
మార్పులు తీసుకురావడం వల్ల వచ్చాయి.
Huaxi residents live in luxury, western-style, single-family homes.

వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని డిమాండ్ కలిగిన వ్యాపార రంగాలకు మళ్లించారు. అందుకోసం
రైతులందరూ కమ్యూన్‌గా (ఒక బృందంగా) ఏర్పడ్డారు. ఇనుము ఉత్పాదక సంస్థలు, రవాణా
సంస్థలు, దుస్తుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కమ్యూన్ అంటే ఒక రకంగా మన
దగ్గరున్న రైతు సహకార సంఘంగా చెప్పుకోవచ్చు. కమ్యూన్ లాభాల బాట పట్టాక మరికొన్ని
సబ్సిడరీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిపి 40 దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి
చేరుకోవడంతో.. రైతుల దశ తిరిగింది. విపరీతమైన లాభాలు రావడంతో.. రైతులందరికీ
అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది కమ్యూన్. ఎటు చూసినా కిలోమీటరు కూడా లేని హక్సీ..
ఇప్పుడు చైనాలోనే అత్యంత ఖరీదైన గ్రామంగా రికార్డులకు ఎక్కింది. పల్లెలో అతి
తక్కువ జనాభా ఉన్నప్పటికీ వలస వచ్చిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య ఎక్కువ.

Huaxi's master planner, Wu Renbao has brought Sydney to the Chinese village of
Huaxi - which has its own version of the 'opera house'.

సౌకర్యాలకు కొదవ లేదు..
         
 The one ton 24K gold bull sculpture unveiled in the newly completed
328-meter-tall New Village Building in Huaxi village in Jiangyin city in eastern
China's Jiangsu province
                        
హక్సీ విలేజ్‌ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపేందుకు.. 60 అంతస్తుల ఆకాశ హర్మ్యం
నిర్మించారు రైతులు. ఈ టవర్ ఎత్తు 328 మీటర్లు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన టవర్లలో
ఇది పదిహేనవది. 324 మీటర్ల ఎత్తున్న పారిస్‌లోని ఈఫిల్ టవర్, 319 మీటర్లున్న
క్రిస్‌లర్ బిల్డింగ్‌లకంటే కూడా హక్సీ విలేజ్ టవరే ఎత్తయినది. టవర్ ఆఖరి అంతస్తులో
ఒక టన్ను బరువున్న గోవు స్వర్ణ ప్రతిమను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో
వెచ్చించిన ఈ ప్రతిమను వ్యవసాయానికి చిహ్నంగా భావిస్తారు చైనీయులు.

The 328-meter tall hotel is designed to attract tourists to Huaxi, but it will
take a lot of visitors to make up for the hotel's 3 billion yuan (US$470
million) price tag.

ఆకాశహర్మ్యంలో అత్యాధునిక విలాసవంతమైన సూట్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్స్,
రెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో ఒక ఇంటర్‌నేషనల్ హోటల్‌ను
ఏర్పాటు చేశారు. వీటన్నిట్నీ కేవలం హక్సీ విలేజ్‌లోని రెండువేల మంది రైతులకు
మాత్రమే కేటాయిస్తారు. వ్యాపారం, వ్యవసాయంతో అలసిపోయిన గ్రామస్తులు కుటుంబాలతో
వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోతారు. 

The revolving restaurant at the top of the Longxi International Hotel 















చైనా దేశానికే భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ గ్రామం పర్యాటకులను సైతం విశేషంగా
ఆకర్షిస్తోంది. ఏటా 120 దేశాలకు చెందిన పది లక్షల మంది హక్సీవిలేజ్‌ను
సందర్శిస్తారు.








ఇన్ని విశేషాలుండడం వల్ల ఈ గ్రామం ఇప్పటికే నేషనల్ సివిలైజ్డ్ విలేజ్, నేషనల్
కల్చరల్ మోడల్ విలేజ్ అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ వ్యవసాయంలో
కాలానుగుణంగా మార్పులు తీసుకురావడం, అనుబంధ వ్యాపారాల్లో అడుగుపెట్టడం హక్సీ విలేజ్
రైతులకు కలిసొచ్చింది. ఇలాంటి మార్పును అవకాశమున్న రైతులు అవలంభిస్తే మన రైతులు
కూడా ఆ స్థాయిలో కాకపోయినా.. ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

Posted by Gouthamaraju at 3:23 AM No comments:

Labels: chaina, Gouthamaraju, Huaxi, life, Village, world



WEDNESDAY, JANUARY 25, 2012


డాటరాఫ్ ఆర్ట్


అఫ్సా తంకనత్, ప్రియాంక ఏలే... వీరిద్దరూ ప్రముఖ ఆర్టిస్టులైన ఫవాద్ తంకనత్,
లక్షణ్ ఏలేల డాటరాఫ్‌లు మాత్రమే కాదు, వారి కళకు కూడా వారసులు. ఈ నవతరం ఆర్టిస్టుల
పరిచయమే ...

నేనేమిటో అదే నా సబ్జెక్ట్
- అఫ్సా తంకనత్
ఎవరైనా నా పెయింటింగ్ చూసి అది వారి జీవితాన్ని ప్రతిబింబించిందనుకుంటే చాలు.
అంతకంటే నా చిత్రకళలో ఇంకేమీ ఉండదు. ఇటీవల నేను వేసిన చిత్రాల్లో నా ముఖమే
వాడుకున్నాను. అదేదో సరదాకోసం చేసిన పనికాదు. ఒక సాధారణ అమ్మాయి తన ఫీలింగ్స్‌ను
ఎలా తెలియజేస్తుందో చెప్పడానికే.

ప్రతీదీ నాకు కాన్వాసే...
నాన్న రంగుల లోకంలో పెరిగాను. చిన్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నా చిత్రకళకు
బలైపోయేవి. దిండులు, గోడలు, గచ్చులు, బెడ్‌షీట్స్ ఇలా ఏది కనపడితే దానిపై ఒక కొండ,
ఆ కొండ చుట్టూ చెట్లు వేసేదాన్ని. అలా మొదలై ఫైన్ఆర్ట్స్ బ్యాచిలర్స్ వరకు
వెళ్లాను. పీజీ చేయడం కోసం ఎదురుచూస్తున్నాను.

అరగంట నుంచి నెల వరకు...
నా పెయింటింగ్స్‌కు స్ఫూర్తి నేనే. ఏదైనా ఆర్ట్ వేయాలనుకుంటే అరగంట పట్టొచ్చు,
ఒక్కోసారి నెల కూడా సరిపోకపోవచ్చు. దైనందిన జీవితాన్నే ఎంచుకుంటాను. నా చిత్రాల్లో
సమస్యలు, ఇజాలు, ఉద్యమాలు ఉండవు. మున్ముందు నా ఆలోచనలు మారొచ్చేమో తెలియదుగానీ
ప్రస్తుతానికైతే ఇంతే. నాకు సంతృప్తినిచ్చినంతవరకు పని చేస్తూనే పోతాను. రాజీ
పడను. తాజ్‌కృష్ణలో పెట్టిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాను. నా పెయింటింగ్స్
కొన్ని అమ్ముడయ్యాయి. ఎంతకు పోయాయే తెలియదు. అవన్నీ నాన్న చూసుకున్నారు.

పెయింటింగ్ పర్యటనలు...
విదేశాల్లో నాన్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు జరుగుతుంటాయి. అన్నిటికీ వెళ్లలేదు కానీ
ఇండోనేషియాకు ఒకసారి వెళ్లాను. ఆర్ట్ వేయడంలో పొందే ఆనందాన్ని అక్కడి ఆర్టిస్టుల్ని
చూసి నేర్చుకున్నాను. మన దేశంలో కూడా ఇతర నగరాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు
చూస్తుంటాను. వాటన్నిటినీ చూశాక మనదైన ముద్రకోసం ప్రయత్నించాలని అర్థమయింది.

ఆర్ట్ టీచర్...
ప్రపంచంలోని ప్రముఖ ఆర్టిస్టుల జీవితాన్ని తెలుసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. హెన్రీ,
బెక్‌మిన్, సూజా, మానే, పికాసో వీరందరినీ అధ్యయనం చేస్తుంటాను. ఒక్కొక్కరిదీ ఒక్కో
టెక్నిక్. కొంతమంది పిల్లలు ఆర్ట్ నేర్పమని వస్తుంటారు. అది చూసి నాన్న 'ఆర్ట్
టీచర్ గారూ' అంటూ నా మీద జోకులేస్తుంటారు. నేను దేవుణ్ణి నమ్ముతాను. దేవుడు మహిమలు
నమ్మను. నా ఆర్ట్‌లో సందేశాలు ఉండవు. నేనేమిటో అదే నా పెయింటింగ్.

" నాన్న ఆర్ట్‌లో 20 సంవత్సరాలుగా ' స్త్రీ' యే ప్రధాన సబ్జెక్టుగా ఉంటోంది.
అన్నేళ్లపాటు అదే కాన్సెప్ట్ చుట్టూ బొమ్మలేయడం బోరు కొట్టదా? అని అడిగాను.
'ఎవరైనా ప్రతీ రోజూ మంచి ఆహారమే తినాలనుకుంటారు. అందులో బోరు అనే ప్రశ్న ఉండదు'
అన్నారు నాన్న''.
-అఫ్సా తంకనత్

లాభం.. నష్టం రెండూ ఉన్నాయి
తండ్రి వా రసత్వం అందుకోవడంలో అఫ్సాకు లాభం, నష్టం రెండూ ఉన్నాయి. ఆరంభానికి నేను
ఉపయోగపడతాను. కానీ తరువాత నా పెయింటింగ్స్‌తో ఆమె పనిని పోల్చడం మొదలు పెడతారు. అది
ఎక్కువ శాతం నష్టమే చేస్తుంది. ఆర్ట్ బాగుంటే మేలు చేయొచ్చు కూడా. తనకు నేనేమీ
సలహాలు ఇవ్వను. నేర్చుకోమంటాను. మనం దేన్నయితే కెరీర్‌గా ఎంచుకున్నామో దానికోసం 24
గంటలూ పని చేయాలని చెబుతుంటాను.
- ఫవాద్ తంకనత్

మావనసంబంధాలే ముడిసరుకు
- ప్రియాంక ఏలే
నగర వాతావరణంలో పెరిగాను. నా ఆర్ట్‌కు నేపథ్యం కూడా ఇదే. నాన్న చిత్రాల్లో తెలంగాణ
స్త్రీ ఉంటుంది. ఆ పల్లెల సౌందర్యం ఉంటుంది. నేనలా గీయలేను. నాది పూర్తిగా మోడ్రన్
ఆర్ట్. అయితే సంప్రదాయ చిత్రకళ నుంచి నేర్చుకున్న లైన్, కర్వ్, టెక్నిక్‌ను
ఉపయోగించుకుంటాను.

కళాత్మక అభ్యాసం...
సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ట్‌లో పీజీ చేస్తున్నాను. తరగతులు ఉంటే వెళతాను. లేదంటే
సోమాజిగూడలోని మా స్టూడియోలోనే ఉంటాను. డిగ్రీ చేస్తున్నప్పుడు ఖాళీసమయంలో
మెక్సికన్ ఆర్టిస్టు 'ఫ్రిదా కాలో' ఆర్ట్‌పైన డిసర్టేషన్ చేశాను.

నేను దేవుణ్ణి నమ్మను. మన సమస్యలకు వేరే ఎవరో పరిష్కారం చూపుతారనుకోను. స్త్రీలు తమ
ఇబ్బందుల్ని తామే ఎదుర్కోవాలి. తమకు తామే వాటిని అధిగమించేలా ఆలోచించాలి. ఈ దృక్పథం
కూడా 'ఇరిగరి' అనే ఫెమినిస్టు రచనల్లోంచే అలవడింది నాకు. నా కొలాజెస్‌ల్లో దీనిని
చెప్పడానికే ప్రయత్నిస్తుంటాను. వాటిల్లో స్త్రీ గొప్ప గొప్ప సాహసాలు చేస్తున్నట్టు
కనిపిస్తుంది. అదంతా స్త్రీల్లో హీరోయిజం ఉందని తెలియజేయడానికే.

ఇది నా స్పందన ...
స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదనే స్ఫూర్తితో ఒక పెయింటింగ్ వేశాను. మానవ
సంబంధాల్లోని కళాత్మకత మరింతగా చూపాలనుకుంటున్నాను. నా చిత్రకళకు ఇదే ప్రధాన
ముడిసరుకు. వీటి నుంచి తీసుకున్న థీమ్‌ను ప్రత్యేకమైన మీడియంతో ఎక్స్‌పోజ్
చేయాలనుకుంటున్నాను. సినిమా, టీవీలలో పని చేయాలనే ఆసక్తి లేదు. థియేటర్ ఆర్ట్ అంటే
ఇష్టమున్నా ఇప్పటివరకు దాని జోలికీ వెళ్లలేదు. ఎప్పటికైనా అందులో పనిచేస్తాననే
నమ్మకముంది.

తొలి సంపాదన...
ఐదో తరగతి చదువుతున్న సమయంలో తొలి పెయింటింగ్ వేసినట్టు గుర్తు. నాన్న వేస్తుండగా
కాపీ కొట్టాను. నా తొలి కస్టమర్ మా అక్క, ఆమె స్నేహితులు. నాలుగు అడుగుల పొడవున్న
పెయింటింగ్‌ను 15,000 రూపాయలకు కొన్నారు. గతేడాది రెండు చోట్ల నా పెయింటింగ్స్
ప్రదర్శనకు పెట్టాను. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో 'ఫ్లోరా అండ్ ఫోనా' పేరిట గ్రూప్ షో
జరిగితే అందులో ఉంచాను. అప్పుడు ఓ రెండు పెయింటింగ్స్ 3000, 5000 చొప్పున
అమ్ముడయ్యాయి. నాన్న స్టూడియోకు వచ్చిన వాళ్లు నా చిత్రాలు చూసి కొంటామంటుంటారు.
కానీ ఇవ్వదలచుకోలేదు. కొన్నాళ్ల తరువాత సోలో షో పెట్టాలనే ఆలోచన ఉంది.

" నేను వేసిన పోర్ట్రెయిట్స్ చూసి నాన్న ఏదో చెబుతారని ఆసక్తిగా ఎదురుచూశాను.
వాటన్నిటినీ దగ్గరిగా పరిశీలించాక ఆయన వాటిని దయ్యాల్లా ఉన్నాయన్నారు''
- ప్రియాంక ఏలే

నా బెస్ట్ క్రిటిక్...
ప్రియాంక మంచి మెరిట్ విద్యార్థిని. డాక్టర్‌గా చూడాలనుకున్నాను. ఇంటర్ తరువాత నా
దగ్గరకు వచ్చి ఆర్ట్‌లో బ్యాచిలర్స్ చేస్తానని చెప్పింది. అదే రంగంలో కొనసాగుతున్న
నాకు అదొక మంచి వార్త అనిపించింది. ఎన్నో పుస్తకాలు, ఎంతో ఆర్ట్ మెటీరియల్,
ఇంకెన్నో పెయింటింగ్స్ ఇవే నా సంపాదన. వీటన్నిటినీ ప్రియాంకకు ఇచ్చి నిశ్చింతగా
ఉండొచ్చని భావించాను. ఆమె మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అందుకే కెమెరా ఒకటి బహుమతిగా
ఇచ్చాను. నా కలర్ ప్యాలెట్ వేరు. ఆమె ఉపయోగించే రంగులు వేరు. ప్రియాంక ఆలోచనలు
బాగుంటాయి. ఇప్పుడు నా చిత్రాలకు తనే తొలి, దిబెస్ట్ క్రిటిక్.
- లక్ష్మణ్ ఏలే
- బల్లెడ నారాయణమూర్తి
ఫోటోలు: శివ


Posted by Gouthamaraju at 4:47 AM No comments:

Labels: artist, Famous Persons, Gouthamaraju



THURSDAY, JANUARY 19, 2012


మాటల్లో, జీవితంలో... ‘విన్‌’ ఫ్రే - అమెరికా టాక్‌ షో క్వీన్ .. ఒప్రా విన్‌ఫ్రే



 
భారతీయ మీడియా మార్కెట్‌ హాలీవుడ్గ తారలతో పాటు అమెరికా టీవీ మాధ్యమ దిగ్గజాలను
సైతం ఆకట్టుకుంటోంది. 

ఈ నేపథ్యంలో అమెరికా టాక్‌ షో క్వీన్‌గా పేరొందిన ఒప్రా విన్‌ఫ్రే భారత్‌లో వారం
రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన బాలీవుడ్ తారలతో పాటు జాతీయ మీడియా
దృష్టిని సైతం ఆకట్టు కుంటోంది. న్యూస్‌వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియా సైట్లలో ఎక్కడ
చూసినా విన్‌ఫ్రే కబుర్లే ఉంటున్నాయి.

విన్‌ ఫ్రే సాధించిన విజయాలు ఎన్నెన్నో...ఆమె స్ఫూర్తిగా ఎంతో మంది యువతులు మీడియా
రంగప్రవేశం చేశారు. బాల్యంలో కడు పేదరికాన్ని చవిచూసిన విన్‌ఫ్రే నేడు ప్రపంచ అపర
కుబేరుల్లో ఒకరు. ఎన్నో కష్టనష్టాలను భరించి అట్టడుగు స్థాయి  నుంచి అత్యున్నత
స్థానానికి చేరుకున్నారు.

ప్రొఫైల్‌



పూర్తి పేరు : ఒప్రా గలి విన్‌ఫ్రే
జననం  : 1954 జనవరి 29 
    (మిసిసిపి, అమెరికా)
నివాసం   : కాలిఫోర్నియా (అమెరికా)
చైర్‌పర్సన్‌, సీఈఓ : ఒప్రా ప్రొడక్షన్స్‌
సీఈఓ, సీఒఒ : ఒప్రే విన్‌ఫ్రే నెట్‌వర్క్‌
తొలి ప్రదర్శన : 1983

రాజకీయపక్షం : డెమెక్రటిక్‌ పార్టీ

 


అమెరికా టాక్‌ షో క్వీన్‌, ప్రొడ్యూసర్‌ ఒప్రా విన్‌ఫ్రే వారం రోజుల పాటు భారత్‌లో
పర్యటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పర్యటనలో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌
కుటుంబాన్ని, బాలీవుడ్‌ తారలను, ఇతర ప్రముఖులను ఆమె కలుసుకున్నారు. భారత్‌లో ఆమె
ఎందుకు పర్యటిస్తున్నారన్న అంశంపై రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఆమె మాత్రం నవతరం
ఆధ్యాత్మిక గురువు దీపక్‌ చోప్రా షూటింగ్‌ కోసం వచ్చినట్లు ఓ సోషల్‌ నెట్‌వర్క్‌
సైట్‌లో స్వయంగా తెలిపారు. భారతదేశంలో కొనసాగుతున్న కుటుంబ అనుబంధాలను ఆమె ఈ
సందర్భంగా ఎంతగానో ప్రశంసించడం విశేషం.

‘భారతీయుల సహనశీలత నాకెంతో నచ్చింది. పరస్పరం ప్రేమించుకోవడం, కలసి జీవిం చడం
ఇక్కడి కుటుంబాల్లో చూస్తున్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రముఖు లను మీరు
తల్లిదండ్రులతో కలసి ఎలా జీవిస్తున్నారని అడిగేదాన్ని. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా
చూస్తున్నాను’ అని విన్‌ఫ్రే వ్యాఖ్యానించారు. 

ముంబయి చేరుకున్న విన్‌ఫ్రే మొదట అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
ప్రిన్సెస్‌ ‘బేటీ బి’ని చూసి ముచ్చటపడ్డారు. సుమారు గంట సేపు ఆమె అమితాబ్‌
నివాసంలో గడిపారు. సోమవారం రాత్రి పరమేశ్వర్‌ గోద్రెజ్‌ ఏర్పాటు చేసిన పార్టీకి
హాజరయ్యారు. బాలీవుడ్‌ ప్రముఖులు షారూఖ్‌ఖాన్‌, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా,
లారా దత్తా, శిల్పా శెట్టి, అనిల్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, నేహా దుపియా, సమీరా
రెడ్డి, డినో మోరియా, రచయిత్రి శోభా డే, జ్యుయలరీ డిజైనర్‌ ఫరా ఖాన్‌ తదితరులు ఈ
పార్టీకి హాజరయ్యారు.

నూతన షో ఇంటర్వ్యూల కోసం...
 
‘ఒప్రా నెక్ట్‌‌స ఛాప్టర్‌’ అనే తన నూతన షో కార్యక్రమంలో భాగంగా దీపక్‌ చోప్రాను
ఇంటర్వ్యూ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ప్రపంచవ్యాప్తంగా
పర్యటిస్తున్నారు. దేశదేశాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. 

తాను గతంలో భారత్‌ను ఎన్నడూ సందర్శిం చలేదని, భారతీయ జీవిత కోణాలను తెలుసుకునేందుకు
వచ్చానని తెలిపారు. ముంబయిలో బాలీవుడ్‌ తారలను కలుసుకోవడంతో పాటు మురికివాడల్లోనూ
ఆమె పర్యటించారు. భారత్‌పై ఆమె ఐదు గంటల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
పర్యటనలో భాగంగా దేశంలోని ప్రముఖ చారిత్రక, పర్యాటక కట్టడాలను ఆమె
సందర్శిస్తున్నారు. 
  


ముంబై మురికి వాడల్లో ఓఫ్రా విన్‌ఫ్రే
అమెరికన్ టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్‌ఫ్రే దక్షిణ ముంబైలోని కొలాబా మురికి వాడల్లో
పర్యటించారు. ‘ఓఫ్రా నెక్ట్స్ చాఫ్టర్’ అనే కార్యక్రమం కోసం విన్‌ఫ్రే భారత్‌లో
పర్యటిస్తున్నారు. త్వరలో భారత్‌పై ‘ఓఫ్రా న...ెక్ట్స్ చాఫ్టర్’అనే ఐదు గంటల
కార్యక్రమాన్ని రూపొందిస్తున్నానని ఆమె తెలిపారు.

భారత పర్యటనలో బాలీవుడ్ ప్రముఖుల్ని, ఇతర వ్యక్తుల్ని కలవడం సంతోషానికి గురి
చేసిందన్నారు. భారత దేశ ప్రజల సహనం, ఓపిక చూస్తే ముచ్చటేసిందన్నారు. కుటుంబాలు
ప్రేమతో కలిసి మెలిసి జీవించడం గొప్ప విషయమన్నారు.

సామాన్యులను కలుసుకోవాలి...
విన్‌ఫ్రే పర్యటనపై బాలీవుడ్‌, ఇతర రంగాల ప్రముఖులు సైతం ఎంతగానో స్పందిస్తున్నారు.
‘ఆమె మా ఇంటికి రావడం, చిన్నారిని ఆశీర్వదించడం ఎంతో ఆనందదాయకం. చీరకట్టులో ఆమె
ఎంతో అందంగా ఉందని’ బిగ్‌ బి ట్వీటారు. ఆమె సామాన్యులను సైతం కలుసుకోవాలని
ఆకాంక్షిస్తున్నట్లు సినీనిర్మాత, దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. 

రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. ఆమె పేరు పామ్‌ఫ్రెట్‌ అనే
చేపజాతిని పోలిఉండడాన్ని ప్రస్తావిస్తూ ...పామ్‌ ఫ్రే... విన్‌ఫ్రే... విన్‌ ఫ్రే ఓ
చేపనా అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. ఈ సరదా శృతి మించి ఉందంటూ విమర్శలూ అనేకం
వచ్చాయి. ‘విన్‌ ఫ్రే, షారూఖ్‌...వీరిద్దరినీ నేనెంతగానో ఆరాధిస్తాను’ అంటూ లారా
దత్త ట్వీట్‌ చేసింది. వారిద్దరితో తాను కలసి ఉన్నప్పటి ఫోటోను కూడా ఆమె పోస్ట్‌
చేసింది. నేహా దుపియా కూడా తాను విన్‌ఫ్రేతో కలసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేయడం
విశేషం. ‘విన్‌ఫ్రే ఎంతో అందంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేసింది. ‘చీరలో ఆమె ఎంతో
అందంగా ఉంది’ అని ప్రీతి జింతా పేర్కొంది. ‘అలాంటి వ్యక్తిని ఇంతకు ముందెన్నడూ
కలుసుకోలేదు. ఎంతో ఆనందం కలిగింది’ అంటూ సమీరా రెడ్డి ట్వీట్‌ చేసింది. 

చిన్నతనంలో కటిక దారిద్య్రాన్ని అనుభవించిన విన్‌ ఫ్రే నేడు అత్యంత సంపన్నుల్లో
ఒకరిగా నిలిచారు. తొమ్మిదేళ్ళ వయస్సులోనే ఆమె అత్యాచారానికి గురైందని, 14 ఏళ్ళ
వయస్సులో తల్లి అయిందని చెబుతారు. హైస్కూల్‌లో ఉన్న రోజుల్లోనే ఆమె రేడియో
కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత షికాగో టాక్‌ న్యూస్‌ను మెగా హిట్‌ చేయడంతో
మీడియాలో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు
చేసుకున్నారు.

సాహిత్యం, వ్యక్తిత్వం, ఆధ్యాత్మికం...ఇలా ఆమె స్పృశించని అంశాలంటూ లేవు. ఎంతోమంది
హేమాహేమీలను ఇంటర్వ్యూ చేశారు. అమెరికా ఇప్పటి అధ్యక్షుడు ఒబామా ఎన్నికల్లో
పాల్గొన్న సందర్భంలో ఆయనను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాల్లో కూడా విన్‌ఫ్రే
చురుగ్గా పాల్గొన్నారు.
భారతీయత ఉట్టిపడేలా...చీరకట్టులో!
 
భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో, చేతులకు బంగారు గాజులతో విన్‌ఫ్రే ఓ వేడుకలో
దర్శనమివ్వడం విశేషం. ఆ దుస్తులను తరుణ్‌ తహ్లియాని డిజైన్‌ చేశారు. ప్రముఖ
డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేసిన దుస్తులను కూడా తాను ధరించనున్నట్లు వెల్ల
డించారు. ఇటీవల డర్టీపిక్చర్‌ తార విద్యా బాలన్‌కు దుస్తులు డిజైన్‌ చేసింది ఆయనే
కావడం విశేషం. విన్‌ ఫ్రే కోసం చీరను డిజైన్‌ చేసిన తరుణ్‌ మాట్లాడుతూ, మొదట తాము
ఆమెకు నచ్చే రంగులు తెలుసుకున్నామని అందుకు అనుగుణంగా డిజైన్‌ చేశామని చెప్పారు.
నారింజ రంగు చీర కట్టుకోవాల్సిందిగా తాను సూచించానని, భారతీయత ఉట్టిపడేలా కాంజీవరం
ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నానని తెలిపారు. ఆ చీరకు జిప్‌ ఉందని, దాన్ని స్కర్ట్‌లా
ధరించవచ్చని చెప్పారు. గత ఏడాది లేడీ గాగా భారత్‌ను సందర్శించినప్పుడు ఆమె
కట్టుకున్న చీరను డిజైన్‌ చేసింది ఆయనే కావడం విశేషం. అప్పట్లో లేడీ గాగా కు
ప్రత్యేకంగా డిజైన్‌ చేయలేదని, తన కలెక్షన్‌లలో నుంచి రెండు చీరలను ఆమె ఎంపిక
చేసుకుందని, ఈ దఫా మాత్రం తాను స్వయంగా ఈ చీరను డిజైన్‌ చేసినట్లు తరుణ్‌ తెలిపారు.
ఏనాటి అనుబంధమో...
 
బాలీవుడ్‌ ప్రముఖులతో మరీ ముఖ్యంగా అమితాబ్‌ బచన్‌ కుటుంబంతో విన్‌ఫ్రే అనుబంధం
ఈనాటిది కాదు. 2005లోనే ఐశ్వర్యారాయ్‌ విన్‌ఫ్రే షో లో దర్శనమిచ్చారు. 2009లో
మరోసారి ఆమె తన భర్త అభిషేక్‌తో కలసి ఆ షోలో పాల్గొన్నారు. 

టాక్‌ షోక్వీన్‌గా...
 
విన్‌ ఫ్రే టాక్‌ షో అమెరికాలోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంది. ఈ
కార్యక్రమానికి ఎన్నో అవార్డులు లభించాయి. 20వ శతాబ్ది సంపన్న ఆఫ్రికన్‌
అమెరికన్‌గా ఆమె పేరొందింది. ఎన్నో దాతృత్వ కార్యకలాపాలతో మహా దాతగా కూడా ప్రఖ్యాతి
చెందారు. ప్రపంచంలో స్ఫూర్తిదాయక మహిళల్లో ఒకరిగా ఆమెను గుర్తించారు.


Posted by Gouthamaraju at 5:37 AM No comments:

Labels: Famous Persons, freedom, Gouthamaraju, life, mahila, oprah winfrey,
philosopher, women, world, మహిళ



WEDNESDAY, JANUARY 18, 2012


మధ్యధరాలో ఆ రాత్రి...


 

కోస్టా కంకార్డియా మరో టైటానిక్ అవాల్సింది. అదృష్టవశాత్తూ కాలేదు. టైటానిక్‌లా
సముద్రగర్భంలో మునిగిపోయినా ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు. నాలుగు వేల మందికి పైగా
బతికి బయటపడగా ఐదుగురు మాత్రమే మరణించారు. ఇటలీకి సమీపంలోని ఓ చిన్న దీవి దగ్గర ఈ
నౌక మునిగిపోయినపుడు అందులో ఆరుగురు తెలుగు వాళ్లు చెఫ్‌లుగా పనిచేస్తున్నారు.
వారిలో జొనాథన్ పాటూరి ఒకరు. ప్రస్తుతం రోమ్ నగరంలో సేదతీరుతున్న ఆయనను ఫోన్‌లో
పలకరించినప్పుడు జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చారు..

రాత్రి 9.25 అవుతోంది. మధ్యధరా సముద్రం ఈదురుగాలులతో భయపెడుతోంది. ఆ చల్లటి నీళ్లలో
కోస్టా కంకార్డియా అనే ఒక విలాస నౌక ఇటలీ సమీపంలో వెళుతోంది. అందులో 3,200 మంది
ప్రయాణికులు, వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. సగం మంది రాత్రి డిన్నర్‌ను పూర్తి
చేశారు. మిగిలిన వారంతా డైనింగ్ హాల్ వద్దకు చేరుకున్నారు. వేడి వేడి ఫ్రెంచ్,
ఇటాలియన్ రుచులను సిద్ధం చేస్తున్నారు చెఫ్‌లు. టేబుళ్లను సర్దుతున్నారు వెయిటర్లు.

లయబద్ధంగా వెళుతున్న నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు,
వోడ్కా సీసాలు, ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి.
గాజు సీసాలన్నీ ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి
ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.  "సముద్రంలో ఒక్కోసారి పెద్ద అలలు వస్తుంటాయిలే''
అన్నారు కొందరు. షిప్పుల్లో ఇదంతా మామూలే అన్నారు మరికొందరు.

వారి అంచనాల్ని కొట్టిపారేస్తూ.. మరో పెద్ద కుదుపుకు గురైంది నౌక. ఈసారి వస్తువులే
కాదు, మనుషులూ చెల్లాచెదురయ్యారు. "అమ్మో! మనమంతా మునిగిపోతున్నాం..'' గట్టిగా
కేకలు పెట్టారంతా. ఆహ్లాదంగా సాగిపోతున్న ప్రయాణం ఒక్కసారిగా మృత్యుభయంతో గంభీరంగా
మారిపోయింది. అప్పుడు ఆ నౌకలో ఆరుగురు హైదరాబాద్ కుర్రాళ్లు, ఒక చీరాల వ్యక్తి
ఉన్నారు. వీళ్లంతా నౌకలో పనిచేసే వంటవాళ్లు. పదిహేను రోజుల కిందటే ఈ నౌకలో చేరిన
జొనాథన్ పాటూరి ఆ నాటి సంఘటనను కళ్లకు కట్టినట్లు వినిపించారు.

నౌక ఒక్కసారిగా గట్టి కుదుపుకు గురైంది. వైన్ బాటిళ్లు, వోడ్కా సీసాలు,
ఫోర్క్‌లు, స్పూన్లు, పింగాణి ప్లేట్లు.. టపటపా జారి పడిపోయాయి. గాజు సీసాలన్నీ
ఫెళ్లున పగిలిపోతున్నాయి. "నౌకలో ఏమైంది.. ఏమైంది..!!!!'' ఒకరి ముఖాలు ఒకరు
చూసుకుంటున్నాయి.
- జొనాథన్ పాటూరి

ఉన్నట్లుండి చిమ్మ చీకటి..
"కోస్టా కంకార్డియా ప్రపంచంలోనే పేరున్న క్రూయిజ్ (విలాసనౌక). సముద్రంలో ఏడు రోజుల
ట్రిప్‌లు వేస్తుంది. ఈ సారి ఇటలీలోని రోమ్ నుంచి సవోనా వెళుతోంది. నేను మొన్న
క్రిస్‌మస్ రోజునే ఇందులో చెఫ్‌గా చేరాను. శుక్రవారం రాత్రి 9.20 అవుతోందనుకుంటా.
డిన్నర్‌కు వస్తున్నారంతా. కిచెన్‌లో తొంభైమంది వంటవాళ్లు ఎవరి బిజీలో వారు
ఉన్నారు. నౌకలో ఒక్కో రోజు ఒక్కో దేశపు ప్రత్యేక వంటను వండుతారు. నేను 'పాస్తా' అనే
రకం వంట చేస్తున్నాను.

నౌకలో వచ్చిన కుదుపును చూసి అందరిలాగే మేము కూడా.. సముద్రంలో ఇలాంటివి మామూలే
అనుకున్నాం. పది నిమిషాల తర్వాత కిచెన్‌లోని సామాన్లన్నీ గలగలమంటూ కిందికి
పడిపోయాయి. నౌకలో నిల్చున్న వాళ్లంతా మెల్లగా ఒరిగిపోతున్నారు. నా కాళ్లు వాటంతటవే
వాలిపోతున్నాయి. నౌక దేన్నో ఢీకొట్టింది అని అర్థమైంది మాకు. చెఫ్‌లందరూ ఒక చోటికి
చేరారు. అప్పటికే ప్రయాణికుల అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది.
కెప్టెన్‌కు ఫోన్ చేద్దామనుకునే లోపే ఫట్ ఫట్‌మంటూ కరెంటు తీగలు మండిపోయినట్లు..
శబ్దం వచ్చి.. కరెంటు పోయింది. నౌక మొత్తం చిమ్మచీకటి కమ్ముకుంది. క్షణాల్లోనే
ఎమర్జెన్సీ లైట్లు పడ్డాయి. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం.

అందరం డెక్‌ఫోర్‌లో..
మేమంతా కిచెన్‌లో నుంచి బయటికొచ్చి.. డెక్‌ఫోర్ (నౌకలో బాల్కనీ ప్రదేశం)లో
నిలబడ్డాం. అప్పటికే ప్రయాణికులంతా గుమిగూడారక్కడ. నౌకల్లో ప్రమాదాలు జరిగినప్పుడు
డెక్‌ఫోర్‌కి చేరుకుని, లైఫ్‌బోట్లలో ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో.. నౌక
ఎక్కేటప్పుడే అందరికీ చిన్నపాటి శిక్షణ ఇస్తారు. నౌకలో పనిచేసే మాకైతే ప్రతి వారం
ఈ ప్రాక్టీస్ ఉంటుంది. మా నౌకలో 26 లైఫ్‌బోట్లు ఉన్నాయి.

వాటిని నీళ్లలోకి పడేసి.. ప్రయాణికులను అందులో ఎక్కించాం. ఆ బోట్లను సురక్షితంగా
ఒడ్డుకు చేర్చేందుకు సేఫ్టీ ట్రైనర్ ఒకడుంటాడు. ప్రతి లైఫ్‌బోటుకు ఆరుగురు
సిబ్బంది పనిచేస్తారు. రాత్రి పూట ఆ సముద్రంలో మేమెక్కడున్నామో అర్థం కాలేదు. నౌకలో
ఉన్నంతసేపూ తెలియలేదు కాని బయటికొచ్చాక చలి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుని..
వణికిపోయాం. అప్పుడు ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలుంది.

నౌక ఓ పెద్ద రాయిని గుద్దుకోవడంతో.. ఇంజన్‌లోకి నీళ్లొచ్చాయని తెలిసింది. కొన్ని
గంటల్లోనే షిప్పు పూర్తిగా మునిగిపోవడం ఖాయం అనుకున్నాం. నాకైతే భయం వేయలేదు.
ఎందుకంటే మిత్రులంతా ఒకేచోట ఉన్నాం. కొద్దిమంది ప్రయాణికులనైనా రక్షించి తీరాలని..
రంగంలోకి దూకాం. 'మమ్మల్ని కాపాడండి.. మమ్మల్ని కాపాడండి' అంటూ నౌకలో ఉన్నవాళ్లంతా
మా మీద పడిపోయారు. గందరగోళ వాతావరణం ఏర్పడింది.

రహస్య సంభాషణ..
నౌకలు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు.. ప్రయాణికులు భయపడకుండా సిబ్బంది
మాట్లాడుకునేందుకు కొన్ని రహస్య కోడ్స్ ఉంటాయి. నీళ్లు నౌకలోకి ప్రవేశిస్తుంటే
'డెల్టా ఎక్స్ రే' అంటాం. అగ్నిప్రమాదం జరిగితే 'ఇండియా విక్టర్' అనాలి. బాంబు
బెదిరింపులొస్తే 'బ్రేవో సెరా' అని మాట్లాడుకోవాలి. మా సహోద్యోగి వచ్చి 'డెల్టా
ఎక్స్‌రే' అని చెప్పగానే నౌకలోకి నీళ్లొచ్చాయని తొలి సమాచారం తెలిసింది. లైఫ్
బోట్లలో ప్రయాణికులందరినీ ఎక్కించాం.

అయితే ఆ బోట్లు మా నౌక కెప్టెన్ అనుమతి లేనిదే బయలుదేరకూడదు. కెప్టెన్ 'అబాండన్
షిప్' అని మూడుసార్లు గట్టిగా అరిచి చెప్పాకే వెళ్లాలి. అతని ఆదేశం కోసం టెన్షన్‌తో
ఎదురుచూస్తున్నాం. ఎంతసేపటికీ ఆదేశాలు రాలేదు. మరోవైపు షిప్పు మునిగిపోతోంది.
అందులో ఇంకా సగం మంది ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇక, చేసేది లేక లైఫ్
బోట్లను ఒడ్డుకు చేర్చాం. అదృష్టమేమిటంటే.. మా నౌకకు కేవలం యాభై మీటర్ల దూరంలోనే
పోర్టు ఉంది.

ప్రయాణికులను ఒడ్డున వదిలేసి.. రెండు మూడు సార్లు నౌక వద్దకు తిరిగి వచ్చి మిగిలిన
వాళ్లందర్నీ రక్షించాం. అప్పటికే నౌక చాలా భాగం మునిగిపోయింది. రాత్రి 12.30 గంటలకు
ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నాం కాని చలి పులికి దొరికిపోయాం.
ఒడ్డునున్న ప్రాంతం ఒక చిన్న దీవి. కనుచూపు మేర ఎవ్వరూ కనిపించలేదు. తెల్లవారుజామున
అలికిడి విని.. స్థానికులు మా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. చలికి వణికిపోతున్న
మమ్మల్ని దగ్గర్లోని చర్చికి తీసుకెళ్లారు. అంత రాత్రి పూట ఫాదర్ వచ్చి అందరికీ
బ్రెడ్డు పంచిపెట్టారు.

ఆ తర్వాత హెలికాప్టర్లు, తీరప్రాంత రక్షక దళం మా దగ్గరికి చేరుకున్నాయి.
ప్రయాణికులందరూ కట్టుబట్టలతో ఉన్నారు. అయిదారుగురు చనిపోయినట్లు పత్రికల్లో వార్తలు
చూశాక తెలిసింది. మావైతే పాస్‌పోర్టులు, లగేజి అన్నీ సముద్రంలో పోయాయి. హైదరాబాద్
మిత్రులైన శశిధర్, శరణ్, సురేషాచారి, శ్రీకాంత్, రవి (చీరాల) ఒక చోట ఉండిపోయాం.
ప్రస్తుతం కోస్టా కంకార్డియా యాజమాన్యం మమ్మల్ని రోమ్ నగరానికి చేర్చింది. ఇండియాకు
వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్
చేరుకోనున్నాం.
- మల్లెంపూటి ఆదినారాయణ

Posted by Gouthamaraju at 12:36 AM No comments:

Labels: Costa Concordia, Gouthamaraju, Italy, SEA, SHIP, world



SUNDAY, JANUARY 8, 2012


మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా - శ్రీమతి టెస్సీ థామస్... డి.ఆర్.డి.ఓ. సైంటిస్ట్.


టెస్సీ థామస్ బయోగ్రఫీ చదివితే...  అమె గురించి పెద్దగా ఏమీ తెలీదు. అయితే -
పిల్లల్ని ఎప్పుడూ బడికే కాకుండా... అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకూ పంపాలని
తెలుస్తుంది.
సైన్సు - మేథ్స్ అంటే వారు భయపడుతుంటే కనుకఅంత సీన్ లేదు. అర్థమైతే పీచు పిఠాయే అని
వెన్ను తట్టాలని తెలుస్తుంది. అప్పుడే పెళ్లి వద్దు నాన్నా ఎం.టెక్ చేస్తాను అంటే
అలాగే తల్లీ నీ ఇష్టం అనడమే కరెక్ట్ అని తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు
తెలుస్తాయి.
రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలని లేచిన క్షణం నుంచి లక్ష్యం కోసమే పాటుపడాలని
ప్రశంసల్ని , విమర్శల్ని సమానంగా తీసుకోవాలని పదిమందికి ఆదర్శంగా ఉండాలని...
తెలుస్తుంది.
‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీలోంచి  మీలోకి  ‘అగ్ని’కణాలు చొరబడి మీకొక కొత్తచూపును
ఇస్తాయి!

ఊరికే - ‘కలలు కనండి... కనండి’ అని ముఖం మీది దుప్పటి లాగేసి బ్రెష్షూ పేస్టూ
చేతికిస్తారు కానీ... కలలు కనడానికైనా ఒక ఇన్‌స్పిరేషన్ ఉండొద్దా?!
నాన్న ఏరోనాటికల్ ఇంజినీరు. ఒక ఇన్‌స్పిరేషన్.
అమ్మ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్. ఒక ఇన్‌స్పిరేషన్.
మామయ్య లెఫ్టినెంట్ కల్నల్. ఒక ఇన్‌స్పిరేషన్.
పిన్ని పెద్ద ఫ్యాషన్ డిజైనర్. ఒక ఇన్‌స్పిరేషన్.
కానీ మనలో ఎంతమందికి ఇలాంటి ఇన్‌స్పిరేషన్... పాలపీక గుండా గొంతులోకి దిగి ఉంటుంది?
ఎ.ఆర్. రెహమాన్ ఒక ఇన్‌స్పిరేషన్.
పెప్సీ నూయీ ఒక ఇన్‌స్పిరేషన్.
సచిన్ టెండూల్కర్ ఒక ఇన్‌స్పిరేషన్.
మైక్రోసాఫ్ట్ నీలమ్ ఒక ఇన్‌స్పిరేషన్.
దేశంలో రోజూ లక్షలమంది వీళ్ల ఘనతల్ని వార్తల్లో చూస్తూ ఉంటారు కదా.. ధీమాగా ఎంత
మంది ఇన్‌స్పైర్ అవగలరు? ధీమా ఎందుకంటే - ఇంట్లో సచిన్ ఫొటో ఉన్నంత మాత్రాన మన ఇంటి
దగ్గర శివాజీ పార్క్ ఉండదు కదా! రెహమాన్‌ని తలచుకుని కీ బోర్డుపై వేళ్లు
కదిలించినంత మాత్రాన మన ఇంటికి కాస్త దూరంగానైనా సినిమా ఇండస్ట్రీ ఉండదు కదా!
వాస్తవం ఏమిటంటే - వందకోట్లు దాటిన ఏ దేశంలోనైనా జనాభాకు సరిపడా ఇన్‌స్పిరేషన్
లభ్యం కావడం కష్టం.
మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?
కేరళలోని అలప్పుళ వెళ్లాలి.
అక్కడ దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
అక్కడి నుంచి ‘తుంబా’ వెళ్లే అవకాశం రావాలి.
అప్పుడు దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
మే బీ, మే నాట్ బీ. ఒకటి మాత్రం నిజం. అమ్మానాన్నల్నుంచే, ఏఆర్ రెహ్మాన్‌లనుంచే మనం
ఇన్‌స్పిరేషన్ పొందాలనేం లేదు!!
*********

భువనేశ్వర్ : జనవరి 3 మంగళవారం 2012
కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రాంగణం.
భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మాట్లాడుతున్నారు.
పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ
ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు. తొంభై తొమ్మిదవ
‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది!
సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ
అంటూ... మధ్యలో స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఉన్న వైపు చూసి... మిస్సయిల్ ఉమన్
టెస్సీ థామస్‌ను మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని అన్నారు.
సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్‌లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో
తేలాయి! నెలన్నర క్రితం - నవంబర్ 15న (ఆవేళ కూడా మంగళవారం!) ఒడిషా తీరంలోని వీలర్స్
ఐలండ్ నుంచి భారత ఉపరితల క్షిపణి ‘అగ్ని-4’ను డి.ఆర్.డి.ఓ. ప్రయోగించినప్పుడు
మిన్నంటిన విజయధ్వానాలకివి రీసౌండ్‌లా అనిపించాయి! అగ్ని ఫోర్... మూడువేల ఐదు వందల
కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. ఆ క్షిపణిని వృద్ధి పరిచింది
టెస్సీ, అమె బృందం.
టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి
అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం కూడా మన్మోహన్ మాటల్లో
ధ్వనించింది.
టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డెరైక్టర్!
ఈ అగ్నిపుత్రికకు ఇన్‌స్పిరేషన్... తుంబా.
కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం
‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ.
దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ
ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్‌స్పిరేషన్ మనుషుల నుంచి
రాలేదు. తుంబాలో ఆనాడు తను చూసిన ప్రదేశం నుంచి వచ్చింది.
ఏం చూసింది ఆ అమ్మాయి?
*********

పిల్లలకు ఇష్టమైన సంగీతం... డబడబలు.
పిల్లలకు ఇష్టమైన ఎక్కం... టెన్ వన్స్ ఆర్..!
టెస్సీకి ఏ ఎక్కమైనా ఒకటే. పదమూడో ఎక్కాన్ని కూడా పదో ఎక్కంలా తేలిగ్గా చెబుతుంది.
బ్రైట్ అండ్ బ్రిలియంట్. అయితే ఓరోజు ఎక్కం తప్పింది. థర్టీన్ ఫోర్స్ ఆర్...
దగ్గరో, థర్టీన్ ఫైవ్స్ ఆర్... దగ్గరో తప్పింది. తప్పిన వెంటనే సర్దుకుంది.
కరెక్ట్‌గా చెప్పింది. టెస్సీ ఎందుకు కన్ఫ్యూజ్ అయిందో టీచర్‌కు తెలీదు. కానీ
టెస్సీకి తెలుసు. తనకు ఇష్టమైన సంగీతాన్ని వెదుక్కుంటూ ఆ అమ్మాయి మనసు అలప్పుళ
నుంచి మధ్యలో రెండు జిల్లాలు దాటుకుని తిరువనంతపురం వెళ్లింది. కొన్ని క్షణాలు
అక్కడి
‘తుంబా’లో ఆగింది!
క్రితం రోజే టెస్సీ, ఆమె క్లాస్‌మేట్స్ తుంబా లోని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కు
విజ్ఞానయాత్రగా వెళ్లొచ్చారు. రయ్‌మని ఎగిసిన రాకెట్‌లను చూశారు. వాటి ధ్వని
టెస్సీకి శ్రావ్యంగా అనిపించింది. అప్పటినుంచీ డబడబలకు ఎంటర్‌టైన్ అవడం మాని రాకెట్
సౌండ్‌ని మధ్యమధ్య గుర్తుచేసుకుని ఎంజాయ్ చేస్తోంది ఆ అమ్మాయి.
స్కూల్ ఫేర్‌వెల్‌లో ఎవరెవరు ఏమేం కావాలనుకుంటున్నారో చెబుతున్నారు.
డాక్టర్, ఇంజినీర్, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్...
టెస్సీ వంతు వచ్చింది. రాకెట్ స్పెషలిస్ట్ అవుతానంది! అప్పుడు ఆమెకది మిస్సైల్
టెక్నాలజీ అని తెలీదు. తెలియకపోయినా కచ్చితంగానే తన భాషలో చెప్పింది. సెయింట్
జోసెఫ్ గళ్స్ హైస్కూల్‌లో అదే చెప్పింది. సెయింట్ జోసెఫ్ కాలేజీలోనూ అదే చెప్పింది.
ఎదురుగా బొమ్మను పెట్టుకుని ఇన్‌స్పైర్ అవడానికీ, ఇన్‌స్పిరేషన్ కలిగించే అవకాశం
అప్రయత్నంగా కలగడానికీ మధ్య వ్యత్యాసమే టెస్సీ బయోగ్రఫీ.
*********

శ్రీమతి టెస్సీ థామస్... డి.ఆర్.డి.ఓ. సైంటిస్ట్.
టెస్సీ గురించి నెట్‌లోగానీ, ఇంకెక్కడైనా గానీ ఇంతకు మించి ఎక్స్‌ట్రాగా ఒక్క ముక్క
సమాచారం దొరకదు. ‘ఇండియా టుడే’ లాంటి పత్రిక అవార్డు ఇచ్చినప్పుడో, అగ్ని
సఫలమైనప్పుడో, మరీ అంతగా సఫలం కాలేకపోయినప్పుడో టెస్సీ పేరు బయటికి వస్తుంది. అంతే!
మీడియాకు టెస్సీ థామస్ ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా తట్టెడు పరిమితులకు లోబడి ఉంటాయి.
బహుశా దేశ రక్షణ కోసం తన సైంటిస్టులు ఈ మాత్రం గోప్యనీయతను పాటించడం అవసరమని
డి.ఆర్.డి.ఓ. భావిస్తుండవచ్చు. ఈ సంస్థ భారత రక్షణ మంత్రిత్వ్ర శాఖ పరిధిలో
ఉంటుంది. డి.ఆర్.డి.ఓ. అంటే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.
ఇందులో జరిగే పరిశోధనలు ఎంత గోప్యమో. సిబ్బంది వ్యక్తిగత వివరాలు అంత గుంభనం. వారి
సాధారణ ప్రయాణ వివరాలు సైతం ఫైళ్లలో దూరిపోతాయి.
గత ఏడాది డిసెంబర్ 8న అలప్పుళ లోని పుట్టింటికి వెళ్లివచ్చారు మిసెస్ టెస్సీ. ఆమె
డెయిరీలో అది అతి ముఖ్యమైన రోజు. తల్లి కుంజమ్మ (75) పుట్టినరోజు! బరువు బాధ్యతలు
గల ఉద్యోగంలో క్షణం తీరిక లేకుండా ఉండే కూతురు తన కోసం అంతదూరం రావడం చూసి ఆ
వృద్ధమూర్తి హృదయం పులకించింది. తల్లి స్పర్శకు ఈ ‘మిస్సైల్ ఉమన్’ కొన్ని క్షణాలైనా
పసిపిల్ల అయి ఉంటుంది. తోబుట్టువు టెస్సీ వస్తుందని తెలిసి అన్నదమ్ములు,
అక్కచెల్లెళ్లు కూడా అలప్పుళ చేరుకున్నారు. ఇండియన్ మిస్సైల్ ప్రాజెక్టు తొలి మహిళా
డెరైక్టర్ టెస్సీకి అవి ఎంతో అపురూపమైన క్షణాలు.
త్రిచూర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయ్యాక పుణెలోని డిఫెన్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్స్ టెక్నాలజీ (డైట్)లో ఎం.టెక్ లో చేరారు టెస్సీ.
అక్కడే డి.ఆర్.డి.ఓ. ఆఫర్ చేసిన ‘గెడైడ్ వెపన్ కోర్సు’లో చేరారు. అప్పుడూ ఇంతే.
వెళ్లేందుకు సెలవలు, వెళ్లాక సెలవు కొనసాగింపులు ఒకట్రెండు విజ్ఞప్తులతో దొరికేవి
కాదు. అలప్పుళ నీటికయ్యల్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచివచ్చేది మరి! అక్కడి నుంచి
కదలబుద్ది అయ్యేది కాదు.
టెస్సీ తండ్రి టి.టి.థామస్ 1991లో చనిపోయారు. ఆనాటి విషాద ఉద్వేగాలను వృత్తిపరమైన
బాధ్యతలతో నియంత్రించుకోగలిగారు.
టెస్సీ ఇంజినీరింగ్ చదివి తీరాల్సిందేనని ఇంట్లో అందరికన్నా ఎక్కువ పట్టుపట్టింది
ఆమె తల్లి కుంజమ్మ! నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే ముందు నచ్చిన జీవితం ఏదో
ఎంచుకోవాలి. టెస్సీ మిస్సైల్స్‌ను ఎంచుకున్నారు. ఆమె ఎంపికకు అప్పుడే పెళ్లి
అడ్డుపడకుండా ఆమె తల్లి జాగ్రత్తలు తీసుకున్నారు. టెస్సీ రాకెట్ ఇంజినీర్ అయ్యారు.
‘‘ఎంతో కష్టపడి సాధించుకున్న కెరీర్‌ను కూడా పెళ్లి తర్వాత అమ్మాయిలు
వదిలేస్తుంటారు. అది కరెక్ట్ కాదు’’ అంటారు టెస్సీ... తల్లి కుంజమ్మకు కృతజ్ఞతలు
తెలియజేస్తూ. అగ్ని-4 పరీక్ష తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో
మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లినప్పుడు టెస్సీ బుర్రను కొందరు ఇంజినీరింగ్ అమ్మాయిలు
ప్రశ్నలతో తోడేశారు. టెస్సీ తన సమాధానాలతో వాళ్ల హృదయాలను నింపేశారు!
‘‘ఆడవాళ్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా గుర్తింపు రాదు. చిన్న ఫెయిల్యూర్ కూడా
పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది - అన్‌ఫిట్ అని. నిజమే కదా మేమ్’’
టెస్సీకి అర్థమైంది. అగ్ని-4ని, అగ్ని-3ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు ఈ
అమ్మాయిలు. అగ్ని-3 తన గమ్యాన్ని చేరుకోడానికి ముప్పై సెకన్ల ముందుగానే
బంగాళాఖాతంలో కూలిపోయింది. ఆ ఘటన తో మహిళల శక్తిసామర్థ్యాలను శంకించినవారు...
అగ్ని-4 విజయవంతం అయ్యాక ఆ స్థాయిలో ప్రశంసించలేకపోవడం వారిని బాధిస్తోంది.
‘‘గుర్తింపు, సక్సెస్ వేర్వేరు అంశాలు. గుర్తింపు కోసం సక్సెస్ అవ్వాలని చూస్తామా?
మన పని మనం చేసుకుపోవాలి.’’
‘‘కానీ మేమ్... ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏమిటి?!’’
‘‘అలా ఎందుకు అనుకోవాలి. ఆడామగ తేడాలను ఎవరైనా ఎత్తిచూపుతున్నప్పుడు ఇంకా చక్కగా
పని చేసి మనం ఏమిటో నిరూపించుకుందాం. అప్పుడు జెండర్ గురించి మాట్లాడ్డానికి
అవకాశమే ఉండదు. అగ్ని-3 ఫెయిల్ అయినప్పుడు అంతా దిగ్భ్రాంతికి లోనై చూస్తున్నాం.
అది వైఫల్యమే కానీ, పూర్తిగా కాదని మాకు తెలుస్తూనే ఉంది. కొంతమంది మమ్మల్ని
సపోర్ట్ చేశారు. మరింత ఉత్సాహంగా పని చేశాం. విమర్శగానీ, విచక్షణగానీ మనల్ని
బాధిస్తోందంటే... మన పోరాట పటిమ తగ్గుతున్నదేమో గమనించుకోవాలి.’’
‘‘ఎదగనీయకుండా అడ్డుకునే పరిస్థితులకు సర్దుకుని పోవడం తప్ప దారి లేదా?
‘‘ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. చేస్తున్న పనిలోనే కాకుండా, సంబంధం
ఉన్న ప్రతి పనిలోనూ సామర్థ్యాలను పెంచుకోవాలి. అకస్మాత్తు అవసరాలు మన పాత్రను కీలకం
చేస్తాయి. అప్పుడు కాలుడ్డుపెట్టిన వారే పక్కకు తప్పుకుని దారిస్తారు.’’
‘‘నిజం. చెప్పండి. ఒక మహిళగా మీరు మీ వృత్తిలో సంతృప్తికరంగానే ఉన్నారా? ఎలాంటి
కంప్లైంట్స్ లేకుండా!’’
‘‘ఎస్. ఉన్నాను. నా టీమ్‌లో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరే కాకుండా అగ్ని
ప్రోగ్రామ్‌లో ఇరవై మంది మహిళలు ఉన్నారు. మొత్తం డి.ఆర్.డి.ఓ.లో చూస్తే పదిహేను
నుంచి ఇరవై శాతం వరకు మహిళలు ఉన్నారు. ఇంకా బయటి నుంచి వస్తున్నారు. ప్రతిభను
నిరూపించుకునే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లు ప్రతిభను మెరుగుపరిచేవిగానే
ఉంటాయి తప్ప మాకొక అవరోధంగా అనిపించవు.’’

టెస్సీ ఇంత చెప్పాక ఏ అమ్మాయి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉబలాటపడకుండా
ఉంటుంది?
సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు
తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో
వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలం అన్న ధీమా వస్తుంది!

1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన
కొత్తల్లో ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను,
ఆత్మవిశ్వాసాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు
అవినాశ్ చందర్. త్వరలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ.
ప్రతిష్టను మరోసారి నిలబెట్టేందుకు అగ్ని-5 ను సంధించబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో
గానీ, మార్చిలోగానే టెస్ట్ ఫైర్ జరిపేందుకు టెస్సీ బృందం తమ లంచ్ టైమ్‌ను కూడా
తగ్గించుకుంది!
*********

డి.ఆర్.డి.ఓ.లో టెస్సీ ప్రస్థానం మరో రెండేళ్లలో రజతోత్సవానికి దగ్గరౌతుంది.
పాతికేళ్లు అంటే పాదరసం లాంటి మనిషి జీవితంలో పెద్ద అమౌంటే! ఇదంతా వృత్తిపట్ల
అంకితభావంతో టెస్సీ వెనకేసుకున్న సంపద. డి.ఆర్.డి.ఓ.లో శాస్త్రవేత్తలు, భారత రాజకీయ
రంగ ప్రముఖులు ఆమెను ‘రాకెట్ లేడీ’ అంటారు. మంద్రస్థాయిలో ఇది ‘భారత రత్న’
అన్నట్లుంటుంది టెస్సీని అభిమానించే మహిళలకు, ఇంజినీరింగ్ విద్యార్థినులకు.
అగ్ని-1 నుంచి ప్రస్తుతం సిద్ధమౌతున్న అగ్ని-5 వరకు ప్రతి దశలోనూ ఉపరితల క్షిపణుల
తయారీలో టెస్సీ అతి కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఎలా సాధ్యం ఇంటి కోసం,
దేశం కోసం బ్యాలెన్సింగ్‌గా పని చేసుకుంటూ పోవడం!
ఆ క్రెడిట్ అంతా తన భర్తదేనని అంటారు టెస్సీ. ఆయన కూడా గెడైడ్ మిస్సైల్
టెక్నాలజీలోనే పోస్టు గ్రాడ్యుయేట్. కొన్నాళ్లు డి.ఆర్.డి.ఓ.లో చేశారు కనుక అక్కడి
బాధ్యతల గురించి బాగా తెలుసు. అందుకే టెస్సీ ఇంటికి వచ్చే సమయానికి పూచికపుల్లనయినా
ఇటు తీసి అటు పెట్టే అవసరం లేకుండా జాగ్రత్త పడతారు. ఒకేసారి అనేక బాధ్యతలు మీద పడి
ఆమె సతమతమౌతున్నట్లు కనిపిస్తే ఎంకరేజ్ చేస్తూ ఆ భారాన్ని కొంత తగ్గిస్తారు. వారి
ఏకైక కుమారుడు తేజస్. మన దేశవాళీ తేలికపాటి యుద్ధ విమానం పేరునే టెస్సీ తన కొడుక్కి
పెట్టుకున్నారు. అతడూ ఎంటెక్‌కి వచ్చేశాడు!
పిల్లల్ని సైన్స్ కోర్సుల్లోకి ఎంకరేజ్ చెయ్యాలని టెస్సీ చెబుతుంటారు. ‘‘సైన్స్,
మేథ్స్ లేకుండా నిత్యజీవితంలో మనిషి రెండడుగులైనా ముందుకు వేసే పరిస్థితి
లేనప్పుడు... టఫ్‌గా ఉంటాయని సైన్స్ సబ్జెక్టులు తీసుకోడానికి విద్యార్థులు వెనకంజ
వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంట్రెస్ట్ లేనంత వరకే ఏదైనా టఫ్. ఆ సంగతి పిల్లలకు
అర్థమయ్యేలా చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ అవసరాలను తీర్చవలసిన బాధ్యత తమ
పిల్లలపై కూడా ఉందని ప్రతి తల్లీ తండ్రీ గ్రహించాలి’’ అంటారు టెస్సీ.
లాబ్‌లో తన జూనియర్ కలీగ్స్‌తో టెస్సీ కూడా ఇదే విధంగా ఉంటారు. అంటే...
స్ట్రిక్ట్‌గా ఉండే ఒక పేరెంట్‌లా. వారి నుంచి ఆవిడ పూర్తిస్థాయి అంకితభావాన్ని
మృదువుగా పిండుకుంటారు. ఒక దేశపు అత్యున్నతస్థాయి సంస్థలో బాధ్యతలు సక్రమంగా
అమలవడానికి ఈ మాత్రం ‘కాఠిన్యం’ అవసరమే! అలాగని టెస్సీ బాసిజం చూపించరు. చెప్పడం
చేతకాకపోతే కదా అరవడం.
*********

ఒక సాధారణ ఉద్యోగి లేచినట్లే రోజూ ఉదయం నాలుగింటికే నిద్రలేస్తారు టెస్సీ. అప్పటి
నుంచి ఆమె డ్యూటీ మొదలౌతుంది.
తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని అంటారు. ఆ మాటలో ఎంత నిజం ఉందో కానీ, కలల్ని
నిజం చేసుకోడానికి ఆ మాత్రం ముందుగా లేవడం అవసరం. ఎందుకంటే - అసలు కలలే కనని వారికి
కూడా ఇన్ స్పిరేషన్ ఇచ్చే టైమ్ అది.
టెస్సీ థామస్
డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్త (48)
జన్మస్థలం : అలప్పుళ (అలెప్పీ) కేరళ
తల్లిదండ్రులు : 
టి.టి.థామస్, కుంజమ్మ
భర్త : సరోజ్
కుమారుడు : తేజస్
తొలి ఉద్యోగం : పుణె లోని డి.ఆర్.డి.ఓ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో
గెడైడ్ మిస్సైల్ ఫ్యాకల్టీ మెంబర్‌గా (1987)
పదోన్నతి : గెడైడ్ మిస్సైల్స్‌లో ఎం.ఇ. డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్
సిస్టమ్స్
లేబరేటరీలో ‘బి’ సైంటిస్ట్‌గా (1988)
ప్రస్తుత హోదా: మిస్సైల్ ప్రాజెక్ట్ తొలి మహిళా డెరైక్టర్

టైటిల్ : మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా

అవార్డులు
అగ్ని సెల్ఫ్ రిలయన్స్ అవార్డు (2001)
పాత్ బ్రేకింగ్ రిసెర్చ్ / ఔట్‌స్టాండింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవార్డు (2007)
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్ ప్రైజ్ (2007)
నేషనల్ సైన్స్ డే - డి.ఆర్.డి.ఓ. సిలికాన్ మెడల్ అండ్ కమెండేషన్
సర్టిఫికెట్ (2008)
డాక్టర్ కల్పన చావ్లా మెమోరియల్ లెక్చర్ ఆనర్ (2009)
ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (2009)
‘అగ్ని’హోత్రి
క్షిపణి (మిస్సైల్) అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో
ఇప్పటి వరకు నాలుగు రకాల ఏ (అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4) క్షిపణుల పరీక్ష
జరిగింది. వచ్చే ఫిబ్రవరి-మార్చిలో అగ్ని-5ను మన రక్షణ శాఖ పరీక్షించబోతోంది. ఆరంభం
నుంచీ ఈ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉన్న టెస్సీ...
అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఉన్నారు. అగ్ని-5కి కూడా ఆమె నేతృత్వం
కొనసాగుతుంది. దేశ రక్షణ వ్యవస్థలోని సకల విభాగాలలో ఇప్పటికే సమర్థంగా సేవలు
అందిస్తున్న భారతీయ మహిళల్లో... యుద్ధ సంబంధమైన విధులను సైతం నిర్వహించగల సత్తా
ఉందని టెస్సీ అంటున్నారు.
ఉపరితలం నుంచి ఉపరితలానికి టార్గెట్ రీచ్ అయ్యే దూరాన్ని బట్టి అగ్ని శ్రేణులు
ఉంటాయి. అగ్ని-వన్... 500 - 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే విధంగా
తయారైనది. అగ్ని-ఫైవ్ 5000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో
తయారవుతోంది.

courtesy - సాక్షి ఫ్యామిలీ
 

Posted by Gouthamaraju at 6:30 AM No comments:

Labels: D.R.D.O., Famous Persons, Gouthamaraju, india, life, mahila, missile,
women, world, మహిళ

Older Posts Home

Subscribe to: Posts (Atom)


RYTHU

రైతు

Promote Your Page Too



ఆయురారోగ్యాలు

ఆయురారోగ్యాలు

Promote Your Page Too



OWN YOUR LAND

Agriculture / Farm Land for Sale

Promote Your Page Too



FOOD

Food

Promote Your Page Too



ABOUT ME

Gouthamaraju View my complete profile



MY BLOG LIST

 * OWN YOUR LAND
   30 Acres Land - 30 Acres Land for Sale Rs.15 Lakhs/ Acre 100 + KM from
   Hyderabad
   
 * రుచుల పేజి
   ఆత్మీయత, అభిమానం... ఇలా కూడా ఉండొచ్చు. - *ఆత్మీయత ఇలా కూడా ఉండొచ్చు. ప్లేటు
   నిండా రోటీలు, పక్కనే మటన్ ఖీమా!అభిమానం ఇలా కూడా ఉండొచ్చు. ప్లేటు నిండా
   పూరీలు, పక్కనే పనీర్ చిల్లీ ఫ్రై! ఆత్మీ...
   
 * తెలుగు కిచిడి
   ఘాటైన పరిమళం ...... ఖుష్బూ - *ఒక గ్లామర్ హీరోయిన్ నుంచి, ఆధునిక ఆలోచనాత్మక
   స్త్రీకి ప్రతీకగా మారడానికి మధ్య, ఖుష్బూ ప్రయాణం కొన్ని సినిమాలు, కొన్ని
   వ్యాఖ్యానాలు, కొన్ని వివాదాలు! ‘‘నాక...
   
 * ఆయురారోగ్యాలు
   
   Food as Medicine - . *HEADACHE? EAT FISH! * Eat plenty of fish -- fish oil
   helps prevent headaches.. So does ginger, which reduces inflammation and
   pain. *H...
   
 * గౌతమ్ రాజు
   తల్లీ పిల్లల డైటీషియన్ - *ఇండియాలో మంచి చదువులే చదువుకున్నా అమెరికాకి రాగానే
   ఆ చదువుకు సంబంధం లేని మంచి జీతాలొచ్చే వేరే ఉద్యోగాలకి చాలామంది వెళ్లిపోతారు.
   కానీ కొంతమంది మాత్రం తమ...
   
 * విహారాలు
   
   అద్భుత సౌందర్యం ఆన్గ్‌కార్ వాట్ ఆలయం - *కొద్దిరోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధ
   ఆన్గ్‌కార్ వాట్ దేవాలయాన్ని సందర్శించే అవ కాశం కలిగింది నాకు. కాంబోడియా
   దేశంలోని సయాంరీప్ రాష్ట్రంలో ఉన్న ఈ వైష్ణవ దే...
   
 * రైతు
   ఆంధ్ర ప్రదేశ్ లో జల కళ - *ఆంధ్ర ప్రదేశ్ లో జల కళ *
   
 * తెలుగు ఓటరు
   
   ఊపే ఆ చేతుల వెనక... - * వాళ్లు ఎందుకు చేతులు ఊపుతున్నారు? ఒలింపిక్స్‌లో
   గెలిచి దేశానికి మంచి పేరు తెచ్చారనా? ఎవరెస్టును అధిరోహించి గర్వకారణంగా
   నిలిచారనా? అంతరిక్షంలో మన జెండాన...
   
 * రాజకీయులు
   -
   
 * Yes! Congress. యస్ ! ఇది కాంగ్రెస్.
   
   త్రిమూర్తులకు గర్వభంగం! - *త్రిమూర్తులు హస్తిన వెళ్లి వచ్చారు. మరి సంధి
   కుదిరిందా అంటే... ఆ దాఖలాలైతే కనిపించడం లేదు. ముగ్గురూ కలిసి టిఫిన్‌ చేసినా
   ఎవరిదారిన వారు ఇళ్లకు వచ్చేశారు. ...
   
 * కోడిపందెం
   కోడి పందాల రక్తపు సొమ్ము - *‘ప్రాణాలు తీయాలి..మూగజీవాలను దగ్గరుండి మరీ
   చంపించాలి.. అవసరమైతే కత్తులు కట్టాలి..డబ్బు మూట కట్టాలి’ *ఇది కోడిపందెం దారుల
   సూక్తి. ప్రకాశం జిల్లా ఎడ్ల బండ...
   
 * కోడిపందాలు
   కోడి పందాల రక్తపు సొమ్ము - *‘ప్రాణాలు తీయాలి..మూగజీవాలను దగ్గరుండి మరీ
   చంపించాలి.. అవసరమైతే కత్తులు కట్టాలి..డబ్బు మూట కట్టాలి’ *ఇది కోడిపందెం దారుల
   సూక్తి. ప్రకాశం జిల్లా ఎడ్ల బ...
   
 * మధు మేహం Diabetes
   డయాబెటిస్‌కి దివ్య ఔషదం ‘ హోమియో ’ - [image: features2] *మధుమేహం లేదా షూగర్‌
   వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ మెల్టెటిస్‌ అని వ్యవహరిస్తారు. నేటి
   సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ...
   
 * కనుమూరి బాపిరాజు
   
   టీటీడీ చైర్మన్‌గా కనుమూరి బాపిరాజు - * టీటీడీ చైర్మన్‌గా కనుమూరి
   బాపిరాజుతిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ
   మంత్రి కనుమూరి బాపిరాజును ప్రభుత్వం నియమించింది. ...
   
 * యస్! వై.యస్. YES! Y. S.
   మహాజనం చెక్కిన సజీవశిల్పం వైఎస్ * సంస్మరణ - *వైఎస్‌పై నేడు బురద జల్లుతున్న
   వారిలో అత్యధికులు కాంగ్రెస్‌లోని ఒకనాటి ప్రత్యర్థులే. తెలుగుదేశం పార్టీ
   నాయకులకు వత్తాసు పలుకుతూ అధిష్టానం పేరు చెబుతూ, కాం...
   
 * మహాకవి శ్రీ శ్రీ శతజయంతి
   
   శ్రీ శ్రీ, - మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010 - *మహాకవి శ్రీశ్రీ *
   శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ.
   శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా...
   
 * SatyaMaytas
   
   రాజులకు తలవంపులు, అవమానం గ్లోబలైజ్ అయ్యింది -
   
 * N T R ది లీడర్
   
   తెలుగువాడి ఆత్మారాముడు - ఎన్టీఆర్ -
   
 * AndhrAssom
   
   ఆంధ్ర , అసోం మత్స రైతుల సమ్మేళనం - 2007 సం. నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకు -
   Assam Andhra Fish Farmers Meet 29th Nov - 2nd Dec 2007 ...
   
 * బాపు కార్టూన్లు
   
   బాపు కార్టూన్స్ - బాపు కార్టూన్స్
   

Show 5 Show All



BLOG ARCHIVE

 * ▼  2012 (7)
   * ▼  September (1)
     * తల్లీ పిల్లల డైటీషియన్
   * ►  April (1)
   * ►  February (1)
   * ►  January (4)

 * ►  2011 (23)
   * ►  December (4)
   * ►  November (3)
   * ►  October (1)
   * ►  August (1)
   * ►  July (4)
   * ►  June (5)
   * ►  May (3)
   * ►  March (1)
   * ►  February (1)

 * ►  2010 (18)
   * ►  November (6)
   * ►  October (6)
   * ►  September (6)

 * ►  2008 (1)
   * ►  October (1)






Travel theme. Powered by Blogger.



Diese Website verwendet Cookies von Google, um Dienste anzubieten und Zugriffe
zu analysieren. Deine IP-Adresse und dein User-Agent werden zusammen mit
Messwerten zur Leistung und Sicherheit für Google freigegeben. So können
Nutzungsstatistiken generiert, Missbrauchsfälle erkannt und behoben und die
Qualität des Dienstes gewährleistet werden.Weitere InformationenOk